PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదరగొట్టిన కొహ్లి !

1 min read

పల్లెవెలుగువెబ్ : చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా చిరస్మరణీయం విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విక్టరీ నమోదు చేసింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ మైదానంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు ఆనందోత్సాహాలతో గంతులేశారు. కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోరుల్, 4 సిక్సులున్నాయి.

About Author