PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

29న కొక్కి సుబ్రహ్మణ్యం పీఠాధిపతి కర్నూలుకు రాక..!

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ధర్మ పర్యటన లో భాగంగా శ్రీ కొక్కి సుబ్రహ్మణ్యం స్వామీ పీఠధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్య ప్రసన్న తీర్థ స్వామీజీ ఈ నెల 29న కర్నూలులో పర్యటించనున్నట్లు లో కరివేన సత్రం కార్యవర్గ సభ్యులు హెచ్ కె మనోహర రావు, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర్ శర్మ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కొక్కి సుబ్రమణ్యం స్వామి పర్యటన వివరాలు తెలిపారు.

29వ తేదీ సాయంత్రం 5 గంటలకు కర్నూలు నగరం NR పేట సంకల్ భాగ్ లోని శ్రీవేంకటేశ్వర స్వామీ దేవాలయం లో పూజ నిర్వహిస్తారు. 6 గంటలకు అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్యాన్నాదాన సత్రం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ కంచి శంకర మఠం వేద విద్యాలయం చేరుకొని భక్తులకు అనుగ్రహ భాషణం, ఆశీర్వచనం ఇస్తారు. ఉదయం స్వామి వారి పాద పూజ భక్తుల గృహము లలో చేసుకొనుటకు అవకాశం ఉండును. బిక్ష అనంతరం స్వామీ వారు బెంగుళూరు హైవే లో కల గోశాల సందర్శన చేసుకొని బెంగుళూరు వెళ్తారని కరివేన సత్రం కార్యవర్గ సభ్యులు హెచ్ కె మనోహర రావు, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర్ శర్మ, అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్య అన్నదాన సత్రం కార్యదర్శి dr n వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమం కార్యదర్శి హెచ్ కె రాజశేఖర రావు, బృందావనం హోటల్ శ్రీధర్ గారు పాల్గొన్నారు. వివరాలకు 9441761257, 9059000992, 9491526678.

About Author