PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరసన ధ్వనులతో దద్దరిల్లిన కొల్లేరు ప్రాంతాలు..

1 min read

– మణిపూర్ లో ప్రజాశాంతి నెలకొల్పాలి..

– పి జీవన్ కుమార్

– దాడులు అరికట్టాలంటూ శాంతి ర్యాలీ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  కొల్లేరు ప్రాంత క్రైస్తవ సంఘాల మరియు  రెవ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో మణిపూర్ రాష్ట్రంలొ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ శాంతి ర్యాలీ నిర్వహించారు.ఈ శాంతి ర్యాలీలో భారీ సంఖ్యలో క్రైస్తవ కుటుంబ సభ్యులు మణిపూర్ రాష్ట్రంలో ప్రజా శాంతిని నెలకొల్పాలని  ఆగడాల లంక నుండి  ప్రారంభమై ప్రజాశాంతి యాత్ర ప్రత్తికోళ్ల లంకలో ముగించుట జరిగింది.ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ మరియు జనరల్ సెక్రెటరీ రెవ.పి.జీవన్ కుమార్ ఆధ్వర్యంలో  మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న మారణకాండ, వర్ణ ఆధిపత్య అణిచివేత, మెజార్టీ పార్టీ పాలకుల విధ్వంసం పై క్రైస్తవ సంఘ సభ్యుల ముక్తకంఠంతో జీవన్ కుమార్ ధ్వజమెత్తారు. వర్ణ , వర్గ , ప్రాంతీయ విభేదాలు లేకుండా మనుషులందరూ ప్రపంచ శాంతి కోరుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెవ.ఇ.రత్న ప్రసాద్ , రెవ.జోసెఫ్ చిక్కాల, రెవ.ఎన్.ఎల్ పాల్, రెవ. ప్రసాద్ రావు,రెవ పెట్ల శామ్యూల్ బాబు, రెవ ప్రేమ్ కుమార్, రెవ జయరాజు, రెవ రాజ్ కుమార్ మరియు స్థానిక కొల్లేరు గ్రామాల దైవసేవకులు, క్రైస్తవ నాయకులు, గ్రామ నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వందల మంది క్రైస్తవులు హాజరై నిరసన తెలిపారు.

About Author