PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలి !

1 min read

పల్లెవెలుగువెబ్ : కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. నరసరావుపేట జిల్లాకు గుర్రం జాషువా, బాపట్ల జిల్లాకు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ల పేర్లు పెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఇటీవల పాలన సౌలభ్యం మిషతో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. మీరు చేసిన ఈ విభజన ద్వారా ప్రతి జిల్లాలో ప్రజల మధ్య అశాంతిని లేపారు. ప్రజలు వర్గాలుగా ఏర్పడి జిల్లాల విభజన పట్ల అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. కొన్ని కొత్త జిల్లాలకు రాజకీయ లబ్ధి కోసమో, యథార్థంగా ఆ నాయకుల పట్ల గౌరవంతోనో కొందరు మహనీయుల పేర్లు వారి గౌరవార్థం పెట్టారు. దానిని స్వాగతిస్తూనే మీ హ్రస్వదృష్టికి బాధపడుతున్నాను. దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన మీరు, దళిత వర్గాలకు చెందిన మహనీయుల పేర్లు కొన్ని జిల్లాలకు పెట్టి వారిని కూడా గౌరవించాలన్న ఆలోచన మీకు రాకపోవడం బాధాకరమని అన్నారు.

About Author