PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగు వెబ్: నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోట‌య్య మృతి చెందారు. క‌రోన సోక‌డంతో 10 రోజులుగా ఆయ‌న నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. గ‌త నాలుగు రోజులుగా వెంటిలేట‌ర్ మీద చికిత్స పొందుతూ ఆయ‌న తుది శ్వాస విడిచారు. క‌రోన సోకిన తర్వాత కృష్ణప‌ట్నం ఆనందయ్య మందు తీసుకున్నారు. ఆనంద‌య్య మందు తీసుకున్నాక కోలుకున్నాన‌ని కోట‌య్య గ‌తంలో ప్రక‌టించారు. ఆ త‌ర్వాత కోట‌య్య ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు. కోట‌య్య ప్రక‌ట‌న త‌ర్వాత ఆనంద‌య్య మందుకు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది.

About Author