PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​ వ్యాక్సిన్​ ’ సురక్షితం..

1 min read
వ్యాక్సిన్​ వేసుకుంటున్న బీవై రామయ్య

వ్యాక్సిన్​ వేసుకుంటున్న బీవై రామయ్య

– నగర ప్రథమ పౌరుడు బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్ప్రతిలో శుక్రవారం నగర ప్రథమ పౌరుడు మేయర్​ బీవై రామయ్య కోవిడ్​ వ్యాక్సిన్​ వేసుకున్నారు. ఆస్ప్రతి సూపరింటెండెంట్​ నరేంద్రనాథ్​ రెడ్డి, వైద్యుల సమక్షంలో వ్యాక్సిన్​ వేసుకున్న బీవై రామయ్య… మహమ్మారి కరోనా వైరస్​ నుంచి రక్షణ పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సమర్థవంతంగా కోవిడ్​ వ్యాక్సిన్​ తయారు చేసిందని, వ్యాక్సిన్​పై అపోహాలు వద్దన్నారు. అనంతరంఆస్ప్రతి సూపరింటెండెంట్​ నరేంద్రనాథ్​ రెడ్డి మాట్లాడుతూ కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, అదేవిధంగా జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలన్నారు ఆసుపత్రికి రోగుల పరామర్శ కోసం వచ్చే వారు అత్యవసరం అయితేనే.. రావాలని కోరారు. కార్యక్రమంలో వై.యస్.అర్. సి.పి.కో- ఆర్డినేటర్ శ్రీకాంత్, వైద్యులు, సిబ్బంది తదితులు పాల్గొన్నారు.

About Author