NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అబ్బాస్ న‌గ‌ర్ లో ఘ‌నంగా కృష్ణాష్ట‌మి వేడుక‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. క‌ర్నూలు న‌గ‌రంలోని అబ్బాస్ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన శివ‌శంక‌ర్ రావు, రేణుక దంప‌తుల కుమారుడు ద‌క్షిత్ శ్రీకృష్ణుడి వేష‌ధార‌ణ‌లో అల‌రించారు. కృష్ణాష్టమి పర్వ దినం పురస్కరించుకొని ప్రతి ఇంటిలోనూ వేడుకలు నిర్వహించారు. చిన్నపిల్లలు ను శ్రీకృష్ణుని వేషధారణలో అలంకరించి ఆయా కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. మరికొందరు పిల్లలను గోపికల రూపంలో అలంకరించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

                                 

About Author