NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాయత్రీ గోశాలలో నేడు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: శ్రీకృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు గాయిత్రి గోశాల – కర్నూలు సంయుక్త నిర్వహణలో సోమవారం ఉదయం శ్రీ గోదా విష్ణు సహస్రనామ పారాయణ బృందంచే విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, అన్నమాచార్య సంకీర్తనలు,గోపూజ , ఉట్లోత్సవం మరియు బాలకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, గాయత్రి గోశాల అధ్యక్షులు దోమా జగదీశ్ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో యువ పారిశ్రామిక వేత్త టి.జి. భరత్, శారదా జ్ఞాన పీఠాదిపతి శివయోగీంద్ర సరస్వతి స్వామి పాల్గొంటారని పేర్కొన్నారు.

About Author