PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RRR అరెస్టుకు క్షత్రీయ సంఘం నిరసన

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : ప్రజాప్రతినిధైన ఎంపీ రఘరామకృష్ణం రాజు ను విచారణ పేరు తో దారుణంగా కొట్టడం అమానుషమని క్షత్రియ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లె గ్రామంలో క్షత్రియులు రామకృష్ణం రాజు, అమరేశ్వర్ రాజు భాస్కర్ రాజు, ప్రసాద్ రాజు, మహేంద్ర రాజు, శేశషం రాజు తోపాటు మరి కొంత మంది క్షత్రియులు నరసాపురం ఎంపీ రఘరామకృష్ణం రాజు ను అరెస్టు చేసి దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. ఏదైనా తప్పు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలే తప్పా కక్ష సాధింపు చర్యలు పాల్పడి ఓ ప్రజా ప్రతినిధి అని చూడకుండా కొట్టడం దారుణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక ఎంపీ నే ఇలా కొట్టారంటే ఇక సామాన్యుల పరిస్ధితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. విచారణ పేరుతో ఎంపీ రఘరామకృష్ణం రాజు ను కొట్టిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని క్షత్రీయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

About Author