PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐకియా పై కేటీఆర్ ఆగ్ర‌హం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్‌ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా కౌంటర్‌లో ఉన్న సిబ్బంది తమపై జాత‍్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్‌ చేసింది.

                                    

About Author