NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు.. అప్పుల బాధ‌తో రైతు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అప్పుల బాధ‌తో ఓ రైతు ఉసురు తీసుకున్నారు. క‌ర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని అల్లుగుండు గ్రామానికి చెందిన ఊరువాకిలి వెంకటేశ్వర్లు అనే రైతు పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య రామలక్ష్మమ్మ వివరాల మేరకు.. వెంకటేశ్వర్లుకు మూడెకరాల పొలం ఉంది. దీన్ని సాగు చేసుకోవడంతో పాటు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మూడెకరాల్లో మూడు సంవత్సరాలుగా పత్తి సాగు చేస్తున్నాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో బ్యాంకులో రూ.50వేల రుణం, గ్రామస్థుల వద్ద రూ.6లక్షల అప్పు మిగిలింది. మూడు రోజులుగా అప్పులవాళ్ల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో భార్యతో చెప్పుకుని మథనపడేవాడు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి పంటకు తెచ్చిన పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన చుట్టుపక్కల వాళ్లు పొలంలో ఉన్న భార్యకు సమాచారమిచ్చారు. వెంకటేశ్వర్లును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.

                                                 

About Author