PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలును..స్మార్ట్​సిటీగా తీర్చిదిద్దుతాం.. : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు: కర్నూలు నగరాన్ని స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​. 44వ వార్డు వెంకటాద్రి నగరలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.35లక్షలతో ఏర్పాటు చేసిన పార్క్​ను శుక్రవారం మేయర్​ బి.వై. రామయ్యతోపాటు ఎమ్మెల్యే రిబ్బన్​ కట్​ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో  వార్డ్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సితార ఇర్ఫాన్ , భాస్కర్ రెడ్డి, లక్ష్మిపత్తి , శేషి రెడ్డి,శివ మోహన్ రెడ్డి ,కృష్ణ రెడ్డి ,రాము యాదవ్ ,మునిసిపల్ ఎ.ఈ, డి.ఈ తదితరులు పాల్గొన్నారు.

About Author