PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ ని కలిసిన కర్నూలు జిల్లా ఐటీడీపీ సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని హైదరాబాద్ లోని వారి స్వగృహంలో ఐటీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు తిలక్ గట్టు, కోడుమూరు , కర్నూల్ , పత్తికొండ ఐటీడీపీ సభ్యులతో కలిసి వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పార్టీ పరంగా చంద్రబాబు గారు ఐటీడీపీ కి ఇచ్చిన టాస్కులు విజయవంతంగా అన్ని నియోజకవర్గాల్లో మొదలెట్టామని , గ్రౌండ్ లెవెల్ లో ఐటీడీపీ సభ్యులు పూర్తి చేసిన ప్రాజెక్ట్ లు సమాచారాన్ని నారా లోకేష్ గారికి వివరించారు.పార్టీ కొరకు మరింత కృషి చేయాలనీ అన్ని విధాలుగా ఐటీడీపీ సభ్యులకు పార్టీ తోడుండి సహకరిస్తుందని నారా లోకేష్ గారు వారికి తెలియ చేసారు.ఆ తదనంతరం నారా లోకేష్ గారికి ఐటీడీపీ సభ్యులంతా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి , ఈ నెలలో మొదలవనున్న లోకేష్ గారి యువగళం కూడా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు తిలక్ గట్టు , కోడుమూరు అధ్యక్షుడు బోయ కృష్ణ , కర్నూల్ అధ్యక్షుడు అఖిల్ , పత్తికొండ అధ్యక్షుడు నాగరాజు , మరియు జిల్లా ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు .

About Author