NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరుపెట్టాలి

1 min read

పత్తికొండ: దామోదరం సంజీవయ్య పేర్లను కర్నూలు జిల్లాకు పెట్టాలని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండలో తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించిన మాల మహానాడు సంఘం నాయకులు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె మల్లికార్జున మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మచ్చలేని మహోన్నతమైన నాయకుడని అవినీతి లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా పేరుగాంచిన మహా నాయకుడు మన జిల్లా వాసి అయినా దామోదరం సంజీవయ్య గారి పేరును మన జిల్లా కి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు నాయకులు మద్దుర్ రాముడు, హోసూరు మధు, హోసూరు నాగేంద్ర, సుమన్, జూటూరు నర్సింహులు,నారాయణ, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

About Author