NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు.. కౌన్సిల్ మీట్ కు 20 మంది కార్పొరేట‌ర్ల డుమ్మా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీట్‌లో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య విబేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఎమ్మెల్యే అబ్దుల్ హఫీస్‌ఖాన్ వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆఫీస్‌లో సమావేశం తర్వాత కౌన్సిల్ మీట్‌కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ఇవ్వడం లేదని మేయర్ బీవై రామయ్య పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్లే పనులు జరగడం లేదని మేయర్ వర్గీయులు అంటున్నారు.

                                                      

About Author