PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. నిద్ర‌లో ఉండ‌గా విద్యుత్ షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఆర్త్ వైర్ తగిలి సాయికుమార్ అనే బాలుడు మృతి చెందాడు. సాయికుమార్ వ‌య‌సు 4 ఏళ్లు. గత రాత్రి బాలుడిని తల్లిదండ్రులు ఇంటి గుమ్మం దగ్గర పడుకోబెట్టారు. అయితే ఆర్త్ వైర్ ఇంటికి ఉన్న ఇనుప తలుపుకు తగలడంతో పక్కన పడుకున్న బాలుడు పక్కకు ఒరగడంతో విద్యుత్ ఘాతానికి గురై నిద్రలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

                                                          

About Author