NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు.. క‌రెంట్ షాక్ తో న‌లుగురు పిల్ల‌లు మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా విషాధం నెల‌కొంది. క్రిష్ణగిరి మండలంలోని ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు ఈతకు వెళ్లి విద్యుత్‌ ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ ఘటన గురువారం జరిగింది. ఇందులో నక్క కార్తీక్‌(13), సంగాల సాయి(12), గుడిసె రాకేష్‌(12), షేక్‌ కమాల్‌ బాషా(12) గ్రామ సమీపంలోని నీళ్ల గచ్చులో ఈతకు వెళ్లారు. గచ్చులో షార్ట్‌ సర్క్యుట్‌ అయి ఉండటంతో పిల్లలు మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరి సమీప బావుల దగ్గర వెతికారు. చివరకు నీళ్ల గచ్చులో రాత్రి 7గంటల సమయంలో నలుగురు పిల్లలు శవమై కనిపించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

                                      

About Author