PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరసన ర్యాలీ లో నెల్లూరు జిల్లా నేతలతో కర్నూల్ ఐటీడీపీ

1 min read

– నెల్లూరు జిల్లాలో నిరసన ర్యాలీలో పాల్గొన్న కర్నూల్ తెదేపా నేతలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టును ఖండిస్తూ సంఘీభావంగా నెల్లూరు అంబేద్కర్ విగ్రహం (V.R.C. సెంటర్) నుండి గాంధీ మహాత్ముని విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ లో నెల్లూరు జిల్లా నేతలతో కర్నూల్  ఐటీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షులు తిలక్ గట్టు  , బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాదవ్  , తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవి  కలిసి పాల్గొని మద్దతు తెలియచేసారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో శాంతియుత నిరసనని చేసుకునే స్వేచ్చని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం హరిస్తుందని , ఇటువంటి పిరికి పంద చర్యలకు పాల్పడిన కూడా పార్టీ నేతలు మరింత దూకుడుగా వెళ్తారే తప్పా వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని తెలియచేసారు , త్వరలోనే చంద్రబాబు నాయుడు  ఎటువంటి తప్పు చెయ్యని ఒక నిర్దోషిగా అన్ని జయించుకుని బైటికొచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ అని తెలియ చేసారు.

About Author