PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా… టి.జి భరత్​

1 min read

కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్

వైసీపీని వీడి టిడిపిలో చేరిన మహిళా నాయకురాళ్లు

రోజురోజుకూ టిడిపి బలోపేతం అవుతుందన్న టి.జి భరత్

టిడిపి గెలిస్తే ప్రజల ఆదాయం పెరుగుతుందన్న టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్లోని టి.జి భరత్ కార్యాలయంలో టిడిపి అసెంబ్లీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతీ శర్మ ఆధ్వర్యంలో వైసీపికి చెందిన 5వ వార్డు మహిళా నాయకురాలు రేణుక, 45వ వార్డు నాయకురాలు విజయతో పాటు మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ కర్నూల్లో రోజురోజుకూ తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతోందన్నారు. పార్టీలోకి వచ్చిన మహిళా నాయకురాళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిపోయిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఆదాయం పెరగకుండా, ఖర్చులు పెరిగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బమ్మ, ఉమ, శంకరమ్మ, సువర్ణ, శారద, సౌభాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author