NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ అధినేతకు.. కురువ సంఘం కృతజ్ఞతలు..

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:తెలుగుదేశం పార్టీ  కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు ను ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని జిల్లా అధ్యక్ష ,ప్రధానకార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు, ఎం.కే .రంగస్వామి తెలిపారు .కర్నూలు జిల్లాలో అత్యదిక జనాభా కలిగిన కురువలను గుర్తించి పంచలింగాల నాగరాజు కు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందులకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చబుద్రబాబు నాయుడు  గారికి కర్నూలు జిల్లా కురువ సంఘము తరపున  కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఈ పదవి కురువలకు వరించేందుకు సహకరించిన జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ  ధన్యవాదములు. ఈ సందర్బంగా కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ ఆలూరు అసెంబ్లీ సీట్ మొలగవల్లి శశికళ కృష్ణమోహన్ కు కేటాయించవలెనని చంద్రబాబు నాయుడు కు విజ్ఞప్తి చేసారు .,జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు ,జిల్లా  కోశాధికారి కే .సి .నాగన్న జిల్లా మహిళా కురువ సంఘము అధ్యక్షులు టి .లీలమ్మ ,జిల్లా నాయకులు టి .పాలసుంకన్న ,కే .గంగారాం నగర సంఘం అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు  పంచలింగాల నాగరాజు కు బొకే ఇచ్చి  అభినందనలు తెలిపారు.

About Author