PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ కార్తీక వనభోజనం వేదిక మార్పు

1 min read

పల్లెవెలుగు వెబ్​ :కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరుపబోయే 19 వ కార్తీక వనభోజనం పెద్దపాడు రోడ్ లోని శ్రీ బీరప్పస్వామి ప్రాంగణం ,మోడల్ స్కూలు పక్కన  ఉంటుందని కమిటీ నిర్ణయించిన మాట వాస్తవమే. కానీ వర్షం కారణంగా  ఆ ప్రదేశం లో నీరు నిలువ ఉండి ,చాలా ఇబ్బందికరంగా ఉన్నందున  పెద్దపాడు రోడ్ లోని లక్ష్మీనారాయణ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న సోనాలిక ట్రాక్టర్ షోరూం వెనుక  పాల సుంకన్న గారి స్థలం లోకి మార్చడమైనదని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం వేదిక స్థలాన్ని పరిశీలించారు.   జిల్లా కురువ సంఘం నాయకులు టి .పాలసుంకన్న ,బి .వెంకటేశ్వర్లు ఎం .కే .రంగస్వామి ,పెద్దపాడు పుల్లన్నతదితరులు స్థల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author