PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12న కురువ సంఘం వివాహ పరిచయ వేదిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లాలోని పెళ్లికాని యువతీయువకులకు వివాహాలు జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేశామని కురువ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు టి. పుల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కె. రంగస్వామి తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి కర్నూలు జిల్లా పరిషత్​ ఆవరణలోని సమావేశ భవనంలో కురువ సంఘం వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఉంటుందన్నారు. కర్నూలు జిల్లా కురువ సంఘం నేతృత్వంలో 2003 నుంచి వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ వేదిక ద్వారా చాలామంది కురువ అవివాహితులకు వివాహాలు జరిగాయని తెలిపారు. భారతీయ సంస్కృతి లో వివాహం అనేది ఒక గొప్ప అనుబంధం, కావున ఈ వేదికను కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు టి. పుల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కె. రంగస్వామి సూచించారు.

About Author