PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12న కురువ వివాహ పరిచయ వేదిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12 న కర్నూలు నగరంలో జిల్లా పరిషత్​ ఆవరణలో కురువ వివాహ పరిచయ వేదిక నివహిస్తున్నట్లు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు డా. టి. పుల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి తెలిపారు. బుధవారం ఉదయం అంబేద్కర్ భవనం దగ్గర సమావేశం జరిగింది. సమావేశంలో డా. టి పుల్లన్న మాట్లాడుతూ సరైన వివాహ సంబంధాలు వెతుక్కోవడం సమస్యగా మారిందని, జిల్లా కురువ సంఘం ఏర్పాటు చేసే వివాహ వేదికను సద్వినియోగం చేసుకోవలెనని సూచించారు. అనంతరం వివాహ పరిచయ వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.కిష్టన్న, కళ్లె లక్ష్మన్న, బి. సి. తిరుపాల్, బి. మల్లికార్జున, నగర కురువ సంఘం అధ్యక్షుడు తవుడు శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శి, బి. రామకృష్ణ, కోశాధికారి కె. వెంకటేశ్వర్లు, సహాయకార్యదర్శి కె. దివాకర్, బి. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author