NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంట‌ర్ అడ్మిష‌న్ల పై కొర‌వ‌డిన స్ప‌ష్ట‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో పదవ తరగతి ఫలితాలు వెలువడి వారం రోజులు దాటింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ అడ్మిషన్లపై ఇంతరవరకూ ఎటువంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ప్రవేశాలను గతేడాది మాదిరిగా ఆన్‌లైన్‌లో చేపడతారా? అంతకుముందు మాదిరిగా ఆఫ్‌లైన్‌లో చేపడతారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి గోప్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలను ఇష్టారాజ్యంగా చేపడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్‌ కళాశాల్లో అడ్మిషన్లు ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టాలని గత ఏడాది ఆదేశించింది.

                                               

About Author