PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాగంటి క్షేత్రంలో లక్ష దీపోత్సవం

1 min read

– తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సౌజన్యంతో యాగంటి క్షేత్రంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు.
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లి : నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి గారు,పాణ్యం ఎమ్యెల్యే,మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ శ్రీమతి.కాటసాని ఉమామహేశ్వరమ్మ గార్ల ఆధ్వర్యంలో ముందుగా యాగంటి దేవస్థానం పశ్చిమ దిశనందు ఎర్రమల పర్వత శ్రేణులపై శ్రీ యాగంటి ఉమామహేశ్వర కార్తీక దీపోత్సవం నిర్వహించారు.అనంతరం శ్రీ ఉమామహేశ్వరనిత్యాన్నదాన సంస్థ ప్రాంగణము నందు లక్ష దీపోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అశేష భక్త జనం పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి సేవలో తరించారు.కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథిలుగా హాజరైన టీటీడీ చైర్మన్ దంపతులు మరియు టీటీడీ ఈ.ఓ.దంపతులను ఘనంగా సత్కరించి,వారికి మరియు హాజరైన అశేష భక్త జనానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

About Author