PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో కనువిందు చేసిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం : భూకైలాసం..శ్రీశైల క్షేత్రంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనువిందు చేశాయి. కార్తీక చివరి సోమవారం కావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పుష్కర ప్రాంగణమంతా విద్యుత్‌ దీపాలంకరణ ఏర్పాటు చేసి కార్తీక దీపాలను వెలిగించారు.

స్వామి అమ్మవార్లకు వేదపండితులు, అర్చకులు లోకకల్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  లక్ష దీపోత్సవం దశ విధ హారతులు  ద్వీప మానంగా  జరిగింది ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్లకు ఓంకార నాగ నంది సూర్య చంద్ర కుంభ నక్షత్ర కర్పూర హారతులను సమర్పించారు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వెలనీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్కరిణి వద్ద ఉన్న కార్తీక దీపాలను భక్తులు వెలిగించారు.

About Author