PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ… జడ్పీటీసీ

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట పంచాయితీలో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను మండల జెడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ శంషున్ బీ,వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు.ఉప్పలదడియ,కలమందలపాడు, మాసపేట గ్రామాలకు చెందిన 75 మందికి గురువారం మ 12 గంటలకు మాసపేట సచివాలయం దగ్గర రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు.మొత్తం 106 మందికి రిజిస్ట్రేషన్ చేయగా వీటిలో 75 మందికి వచ్చాయని మిగతా వారికి త్వరలోనే ఇస్తామని ఈ రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా స్వంత ఇంటి హక్కుగా మీ పేరు మీదే ఉన్నాయని ఈ హక్కు ఇంటి పత్రాల ద్వారా 2030 సం.రం తర్వాత ఇంటిని ఇతరులకు అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుందని జడ్పిటిసి యుగంధర్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయమ్మ,ఎల్లారెడ్డి,విఆర్ఓ ఎం రాఘవేంద్ర,వైసీపీ నాయకులు రామ సుబ్బారెడ్డి,అన్వర్ భాష,మహబూబ్ బాష,

About Author