PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్మశాన వాటికకు.. భూమిని సేకరించి కేటాయించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  ఉయ్యూరు: కృష్ణా జిల్లా ఉయ్యూరు, నగర పంచాయతీలో వేలాదిగా ఉన్న  దళితులు క్రైస్తవులు, మరణిస్తే స్మశాన భూమి లేక ఇబ్బందులు పడుతున్నారని. స్మశాన వాటిక భూమిని సేకరించి కేటాయించాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలియజేశారు. గత 156 సంవత్సరాల క్రితం మర్రివాడ రహదారి పక్కన (గురజాడ డొంక) కేటాయించబడిన భూమి పూర్తిగా సమాదులతో నిండిపోయింది. ఉయ్యూరు దళిత క్రైస్తవులకు నిమిత్తం భూమిని సేకరించి కేటాయించడానికి మండల తాహసిల్దార్ ఉయ్యూరు ఆర్డీవో తగు చర్యలు తీసుకోగలందులకు కృష్ణా జిల్లా స్పందన లో విన్నవించడం జరిగిందని సామాజిక కార్యకర్త  జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author