PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అట్టహాసం.. ఎంపీపీ ప్రమాణస్వీకారోత్సవం

1 min read

– మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి
పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలితాల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధ్యమయ్యిందని కార్మిక శాఖ మంత్రి సోదరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో ఎంపీపీ సుంకర ఉమాదేవి, తెవుల లింగమ్మల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇంచార్జి మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొని సభావేదికపై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదని, జగన్ పాలన ఒక స్వర్ణయుగం అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామవాలంటరీల వ్యవస్థ దేశానికే ఆదర్శం అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు మరిచిపోయారని, స్థానిక విజయాలన్నీ ప్రజలకె అంకితమన్నారు.

అనంతరం గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులను గుమ్మనూరు నారాయణ స్వామి చేతుల మీదుగా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ రామాంజనేయులు, కేడిసిసి బ్యాంక్ జిల్లా డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, జడ్పీటీసీ దొరబాబు, వైకాపా జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్, సింగిల్విండో చైర్మన్ దుమ్మా నరసింహులు, మాజీ చైర్మన్ కేశవ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు వెంకన్న,మహనంది, ప్రకాష్ శ్రీ గిరి క్షేత్రం నిర్వహకులు శ్రీనివాసులు నాయనా, హనుమంతరెడ్డి, పెద్దయ్య, ప్రభాకర్ రెడ్డి, తోయ జాక్షిప్ప, బాలన్న, ఎన్నికల అధికారి వెంకటసుబ్బయ్య, తాసిల్దార్ నిత్యానంద్ రాజు, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, నూతనంగా ఎంపికైన మండల ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి మండల నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

About Author