PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్‌సీఏ చైర్మన్‌గా వీవీఎస్ లక్ష్మణ్

1 min read


పల్లెవెలుగు వెబ్: భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐలో కీలక పాత్ర పోషించనున్నాడు. బెంగళూరూ కేంద్రంగా బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్‌సీఏ (national cricket academy) చైర్మన్‌గా లక్ష్మణ్ నియమితుడయ్యాడు. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందించారు. త్వరలోనే ఎన్‌సీఏ చైర్మన్‌గా లక్ష్మణ్ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్‌సీఏ చైర్మన్‌గా ఉన్న ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో ఆ స్థానాన్ని లక్ష్మణ్ ద్వారా భర్తీ చేశారు.

About Author