PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఆర్ఓ ను కలిసిన ఏపీ వీఆర్​ఓ అసోసియేషన్ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షులు A. మౌలిబాష ఆధ్వర్యంలో డీఆర్ఓ శ్రీ పి.మధుసూధన్ రావుని మర్యాద పూర్వకముగా కలిశారు.ఉమ్మడి జిల్లాలోని గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు కొన్ని ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అందులో ముఖ్యమైనవి వీఆర్​ఓ లకు పదోన్నతులు ఫైల్ త్వరగా పెట్టమని, అలాగే రీ సర్వే లో వీఆర్​ఓ లు పడుతున్న ఇబ్బందులు మరియు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే సస్పెండ్ కు గురైన గ్రేడ్ -1 మరియు గ్రేడ్-2 వీఆర్​ఓ లకు పెండింగ్ ఎంక్వయిరీ కింద పోస్టింగ్ ఇవ్వమని కోరడం జరిగింది..ఈ కార్యక్రమం లో ఏపీ వీఆర్​ఓ అసోసియేషన్ రాష్ట్ర EC మెంబరు తిరుమల రెడ్డి, జిల్లా నాయకులు నాగ మద్దయ్య, K.శ్రీధర్,ఆదోని  మరియు కర్నూలు డివిజన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, నర్సరాజు, అసోసియేషన్ నాయకులు శాంతి,మరియు వీఆర్​ఓ లు పాల్గొన్నారు.

About Author