PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూపూడిని మర్యాద పూర్వకంగా కలిసిన మాల మహానాడు నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: వైసీపీ రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారు ,మాజీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావును నందికొట్కూరు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు పబ్భతి శివ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం వీరపురం గ్రామంలో వైసీపీ నాయకులు స్వామీదాసు  నరసింహా  కుమారుడు వివాహానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, జూపూడి ప్రభాకర్ రావు ముక్య అతిథులుగా విచ్చేశారు. వధువు వరులు నాగేంద్ర ,ప్రేమీల లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు పబ్బతి శివ ప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో పాములపాడు మండల మాల మహానాడు  అధ్యక్షుడు కలుబండి బాలస్వామి, నందికొట్కూరు మాల మహానాడు నాయకులు పి. నాగేంద్ర , విల్సన్ , బాలయ్య, పాల్, ఉసేనాలం, నాగన్న, వెంకటేశ్వర్లు,  తదితరులు పాల్గొన్నారు.

About Author