PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. పుల్లన్న మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రభుత్వ విశ్రాంత అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షులు , కురువ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పుల్లన్న(73)ఆదివారం రాత్రి కర్నూలు లో తన నివాసంలో మరణించారు. నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలానికి చెందిన డా. పుల్లన్న కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజలకు మంచి వైద్యసేవలు అందించడంతో పాటు సామాజిక సేవలు అందించారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు, నగర సహాయ కార్యదర్శి జి. చంద్రశేఖర్​, విశాలాంధ్ర కర్నూలు ఎడిషన్​ మేనేజర్​ కె. నాగరాజు డా. పుల్లన్న మృతదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా ప్రజలకు, కురువ సంఘం అభివృద్ధికి డా. పుల్లన్న ఎన్నో సేవలు చేశారని, ఆయన మరణం ప్రజలకు తీరని లోటన్నారు కురువ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రంగస్వామి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

About Author