PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి వీడి  టిడిపి లోకి. 150 కుటుంబాల చేరిక..

1 min read

పల్లెవెలుగు వెబ్​ ఓర్వకల్లు:  ఇప్యాక్ ఆడియో తో హల్చల్ చేసిన ఏం ఎల్ ఏ ముఖ్య అనుచరుడు పుడిచెర్ల గ్రామానికి చెందిన సుర రాజన్న సోమవారంనాడు తన అనుచరులతో వైసిపి పార్టీ వీడి దాదాపు 150 కుటుంబాలు పాణ్ణ్యం టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ వైసిపి పార్టీ లో భావప్రకటన స్వేచ్ఛ లేదని ఇప్యాక్ వారితో నియోజకవర్గంలో వైసిపి లో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడనని తన వర్గానికి అన్యాయం జరిగితే తాను ఎలా ఉరుకుంటానని బానిస లా అవమానాలు భరిస్తూ ఉండలేనని  పార్టీ కోసం ఎంఎల్ఏ కోసం కష్ట పడ్డ గుర్తింపు లేదని అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు ఈ సారి గౌరు చరిత రెడ్డి భారీ మెజారిటీ తో. పాణ్యం ఎంఎల్ఏ గా గెలవబోతున్నారని జూన్ 6 నా ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని  తామంతా టిడిపి విజయానికి కృషి చేస్తామని గౌరు దంపతుల ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామన్నారు అనంతరం గౌరు దంపతులకు గజమాల తో సన్మానించారు పార్టీ లో చేరినవారికి టిడిపి కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి  ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి, నన్నూరు విశ్వేశ్వర్ రెడ్డి,పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, కల్లూరు మండలం పుసులూరు ప్రభాకర్ రెడ్డి, నన్నూరు కాజామియా ఖాజామీయా, విజయుడు టిడిపి జన సేన బీజేపీ ,ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author