NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పందుల యజమానులపై చట్టపరమైన కేసులు

1 min read

ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు టౌన్ లో పందులను వాటి యజమానులు ఇష్టానుసారంగా వదలడంతో అవి పంట పొలాలు, ఇంటి పరిసరాల చెట్లను, అలాగే పరిసరాలను నాశనం చేస్తూ ప్రజలకు అదేవిధంగా రైతులకు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, స్థానిక ప్రజల, రైతులు, గ్రామ పంచాయితీ అధికారుల ఫిర్యాదుల మేరకు, చెన్నూరు లోని పందుల యజమానులను స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి అనేకసార్లు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో, పందుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని కోర్టుకు పంపడం జరిగిందని ఎస్సై శ్రీనివాసులు రెడ్డి శనివారం సాయంత్రం తెలిపారు, ఇప్పటికైనా పందులను ఊరు బయటకి పంపకపోతే కఠిన చర్యలు తప్పవని పందుల యజమానులను ఆయన హెచ్చరించారు,, ఈ కార్యక్రమంలో పందుల యజమానులు, పోలీసులు పాల్గొన్నారు.

About Author