NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లేగ‌దూడ‌కు బార‌సాల !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ గౌరీశేఖర్‌. పుంగనూరు ఆవుదూడను ఇటీవల ఏలేశ్వరం మండలం జె.తిమ్మాపురంలోని పుంగనూరు గోశాలలో కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకొచ్చిన దగ్గరనుంచి లేగదూడతో కాలక్షేపం చేస్తున్నారు. దాని పై మరింత మక్కువ పెంచుకున్న డాక్టర్‌ లేగదూడకు బారసాల నిర్వహిస్తే ఎలా ఉంటుందని కుటుంబ సభ్యులతో చర్చించారు. భార్యభర్తలు ఆవుదూడకు బారసాల చేయాలని నిర్ణయం తీసుకుని ఈనెల 15న పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బారసాల ఆహ్వాన పత్రాలు ముద్రించి విందుకు హాజరు కావాలని బంధువులు, స్నేహితులు, తోటి డాక్టర్లకు అందజేశారు. వైభవంగా పుంగనూరు లేగదూడకు ఈనెల 15న బారసాల నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను డాక్టర్‌ గౌరీశేఖర్‌ చేస్తూ తన మమకారాన్ని చాటుకుంటున్నారు.

                                                  

About Author