PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో చిరుత‌పులి సంచారం.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా రాంపల్లి, ఇందిరాంపల్లి తదితర గ్రామాల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఫారెస్టు డ్యూటీ పోలీస్‌ లక్ష్మన్న తెలిపారు. ఆదివారం మండలంలోని రాంపల్లి, ఇందిరాంపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి మేకల కాపరులు, రైతులకు చిరుతపులి సంచారంపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సాయంత్రం 4గంటల లోపు గ్రామాలకు చేరుకోవాలని హెచ్చరించారు. చిరుతపులి ఎక్కడైనా కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. రెండు రోజుల క్రితం ఇందిరాంపల్లికి చెందిన మూడు మేకలను, రాంపల్లికి చెందిన ఒక మేకపై చిరుతపులి దాడి చేసినట్టు సమాచారం ఉందని తెలిపారు.

                                 

About Author