PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యమకారులను గెలిపించుకుందాం.. బి.గిడ్డయ్య

1 min read

– ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే ఉద్యమకారులను గెలిపించుకుందామని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఉద్యమకారులు, కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను గెలిపించుకుని శాసనమండలికి పంపుదామని ఓటర్లను అభ్యర్థించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎన్నికల నిబంధనల ను ఉల్లంఘించి ఓటర్లను ఆకర్షించే విధంగా ఉపాధ్యాయులకు గిఫ్ట్ బాక్సులు పంపడాన్ని తప్పు పట్టారు. విజ్ఞులైన ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు లకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, సిపిఐ నాయకులు ఎం.కే.సుంకన్న పాల్గొన్నారు.

About Author