PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి

1 min read

– ఉప సర్పంచ్ సోహెల్, వైసీపీ నాయకులు
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: వైసిపి బలపరుస్తున్న అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కి మొదటి ప్రాధాన్యత నిస్తూ ఎమ్మెల్సీగా గెలిపించాల్సిందిగా వైసిపి మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ సోహెల్ ఓటర్లను అభ్యర్థించారు. గురువారం చాగలమర్రిలోని పలు వీధులలో ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రజల పట్ల,అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అని వారు తెలిపారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల( ఎమ్మెల్సీ) రవీంద్రారెడ్డిని వైఎస్ఆర్సిపి బలపరుస్తూ అతని గెలుపు కోసం పట్టభద్రుల ఓటర్లందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని, నిరుద్యోగ పట్టబద్రులందరూ బాగుపడే రోజులు దగ్గర పడ్డాయని వారు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అబ్దుల్లా, వైసిపి నాయకులు, ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ, పట్టబద్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author