NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేము సిద్ధం సభను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  ఎమ్మిగనూరు లో నేడు జరిగే మేము సిద్ధం సభను జయప్రదం చేయాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం  రాఘవేంద్ర నగర్ లో పర్యటించిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు కు రానున్న నేపథ్యంలో రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రజలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం మేము సిద్ధం అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, ఇన్చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, పెట్రోలు బంక్ శీను ,  వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ వీకేసి రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Author