PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రాహ్మణుల ఐక్యతను చాటుదాం

1 min read

9న ఆత్మీయ సమావేశం

పల్లెవెలుగు, కర్నూలు: బ్రాహ్మణులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు సముద్రాల హనుమంతరావు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు.. కష్ట సుఖాలను పంచుకునేందుకు ఈ నెల 9న ఆదివారం నగరంలోని మౌర్య ఇన్​ ఫంక్షన్​ హాల్​లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని, సమావేశానికి జిల్లాలోని అర్చకులు, వేదపండితులు, పురోహితులు  హాజరు కావాలని కోరారు. శుక్రవారం నగరంలోని  బ్రాహ్మణ ఐక్యవేదిక ఆఫీసు నందు  సముద్రాల హనుమంత రావు మాట్లాడుతూ బ్రాహ్మణుల పిల్లలకు స్కాలర్​షిప్​లు ఇవ్వాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర అంశాలపై బ్రాహ్మణ పెద్దలతో చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రతి బ్రాహ్మణుడు సమావేశానికి హాజరు కావాలని కోరారు . సమావేశంలో  బ్రాహ్మణ నాయకులు  కంచు గంటల శ్యామ సుందర శర్మ,  రవిచంద్ర శర్మ ఆనందరావు,  శ్రీనివాసులు, సాయికుమార్, మారుతమ్మ, అధ్యక్షులు సండేలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author