NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యమ గళాలను గెలిపించుకుందాం…: సీపీఐ

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఉద్యమ గళాలు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను గెలిపించుకుందామని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ కోరారు. శుక్రవారం మండలంలోని చిన్నహుల్తి, జూటూరు ఆర్.మండగిరి అగ్రహారం గ్రామాలలో పట్టభద్రులను, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలల లో ఉపాధ్యాయులను, సచివాలయ ఉద్యోగులను గ్రామాలు ఉన్న పట్టభద్రులను కలుసుకొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యలపై శాసనమండలిలో వానిని వినిపించే ఉద్యమ గళాలను గెలిపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు లకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి రంగన్న, సిపిఐ నాయకులు పులి శేఖర్ ఆదిశేషు బుజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

About Author