PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​’ పిల్లలకు రాకుండా జాగ్రత్తగా ఉందాం..

1 min read

– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కరోన మహమ్మారిపై మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్​ విప్​ శ్రీకాంత్​ రెడ్డి ప్రజలకు సూచించారు. కోవిడ్ బారినపడిన చిన్నపిల్లల కేసులు కోవిడ్ కేర్ సెంటర్ లో నమోదయ్యాయని పేర్కొన్న చీఫ్​ విప్​… చిన్నారులు కోవిడ్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిద్దామన్నారు. అధికార యంత్రాంగం కృషి, ప్రజా సహకారంతో జిల్లాలో కొంతమేర కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. కోవిడ్ బారిన పడిన చిన్నపిల్లలకు కూడా రాయచోటిలోని ఏరియా ఆసుపత్రి, కోవిడ్ కేర్ సెంటర్, అమరావతి ఆసుపత్రిలలో చికిత్సలు అందేలా చర్యలు చేపట్టామన్నారు.

About Author