PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రక్తధానం చేద్దాం ప్రాణాలు కాపాడుదాం…యువత ఇదే నా పిలుపు

1 min read

– యువనేత ఎస్ వి జనక దత్తా రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరం లోని RR ఆసుపత్రి నందు అజ్వా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం ను ఎస్ వి  కుటుంబ  యువనేత  మంచి మనసు ఉన్న శ్రీ ఎస్ వి జనక దత్తా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రక్త దానం అన్ని దానాల కన్న గొప్పది అని, రక్త దానం చేయడం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు కాపాడిన వారం అవుతాము అని తెలిపారు. ముక్యమగా యువత దీన్ని ఆదర్శం గా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి రక్త దానం చేయవచ్చు అని తెలిపారు ఈ రక్త దాన శిబిరం ను ఏర్పాటుచేసిన సా జిద్ మరియు అతని మిత్ర బృందం ను అయన అభినందించారు. కార్యక్రమం లో  వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author