PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో పల్లెకుపోదాం-జెండా ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వమే రావాలని ప్రభుత్వం రావాలంటే ప్రతి కార్యకర్త కష్టపడాలని అప్పుడే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా అవుతారని మిడుతూరు మండల వైసీపీ కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పల్లెకు పోదాం అనే కార్యక్రమం మండల కన్వీనర్ లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తు వ్వా లోకేశ్వర్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ప్రతి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిందని రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంటే ఉంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ వాళ్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు అన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు.తద నంతరం గ్రామంలో జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రా హత్ జబ్బార్,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,నందికొట్కూరు వైసిపి నాయకులు జబ్బార్, సర్పంచ్ లు నాగస్వామి రెడ్డి, వెంకటరామిరెడ్డి, అలగనూరు చిన్న రామచంద్రారెడ్డి,ఈఓఆర్ డి ఫక్రుద్దీన్,పంచాయితీ కార్యదర్శులు సుధీర్,కేశావతి మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author