NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలకనూరులో పల్లెకు పోదాం-జెండా ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ అన్న ప్రభుత్వమే రావాలని ప్రభుత్వం రావాలంటే ప్రతి కార్యకర్త కష్టపడాలని అప్పుడే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా అవుతారని మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో గురువారం సాయంత్రం పల్లెకు పోదాం అనే కార్యక్రమం గ్రామ సర్పంచ్ కురువ ఎల్లయ్య అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, నంద్యాల జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తు వ్వా లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని గత టీడీపీ ప్రభుత్వం పనులు చేయకుండానే టిడిపి నాయకులు నిధులను మింగేశారని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ప్రతి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిందని రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తూ ఉంటే ఉంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ వాళ్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు అన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు నాకు కృషి చేయాలని అన్నారు. తలనంతరం గ్రామంలో జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సుంకేసుల సర్పంచ్ ఇందిరమ్మ,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,జెసి ఎస్ మండల కన్వీనర్ రవికుమార్,ఉపసర్పంచ్ నారాయణరెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,వెంకట్,గ్రామ నాయకులు రామలింగేశ్వర రెడ్డి,సిరిగిరి పుల్లయ్య,అబ్దుల్ ఘని,పంచాయితీ కార్యదర్శులు హసీనా,రఘు మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author