PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరులో బీఎస్పీ జెండా ఎగురవేద్దాం…

1 min read

బీఎస్పీ గెలుపే లక్ష్యంగా బహుజనులు కష్టపడాలి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో  నందికొట్కూరు నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలోని 175 స్థానాలలో విజయం సాధించి బీఎస్పీ జెండా ఎగురవేద్దామని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్జే మలికల్ పేర్కొన్నారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలో పగిడ్యాల రోడ్డు లోని సాపూర్ పంక్షన్ హాల్  నందు నంద్యాల జిల్లా ఇంఛార్జి గద్దల లాజరస్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఈ నెల 20 లోపు అభ్యర్థులను పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు. బహుజన రాజ్యాధికారం కోసం బహుజనులు అందరూ ఏకమై బీఎస్పీ పార్టీ విజయం కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.నందికొట్కూరు నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తందారీకి అడ్డుకట్ట వేయాలంటే అది బీఎస్పీ తోనే సాధ్యమన్నారు.ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లకు స్వేచ్ఛ లేదని అన్నారు.సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. లక్ష్మీనారాయణ , నంద్యాల జిల్లా అధ్యక్షుడు మహేంద్ర , నంద్యాల జిల్లా ఇంచార్జ్ మౌలాలి ,బీఎస్పీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు.

About Author