NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం..

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: పేదల గడపవద్దకే సంక్షేమ పథకాలు అం దించేందుకు జగనన్నే మళ్లీ సీఎం చేసుకుందామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్యాపిలి మండల పరిధిలోని పోతుదొడ్డి, మాన్ డ్డి, అనుమంతురాని పల్లె గ్రామంలో  ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఏపీ ఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లికార్జున రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ కృష్ణమూర్తి, రంగనాయకులు ఆధ్వర్యంలో బుగ్గన అర్జున్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల వైఎస్సార్ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మంత్రి బుగ్గన సారథ్యంలో జరిగిన విద్య, వైద్యం రంగాలోపాటు గ్రామీణ రహదారుల అభి వృద్ధిని వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తాగునీటి సమస్యకు రూ.351 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి తాగునీరు తెచ్చి మంత్రి బుగ్గన శాశ్వత పరిష్కారం చూపారని వివరించారు. కార్య క్రమంలో వైసీపీ నాయకులు వైసిపి నాయకులు రాజా మురళి కృష్ణ ,ఊపర్వతం శ్రీనివాసులు ,శ్రీనివాస్ రెడ్డి ,గండికోట చిన్న రామంజి, ఎంపిటిసి ఓబుల్ రెడ్డి, చిన్న సుంకయ్య, తదితరులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author