PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జగనన్న ఇళ్లు’ విజయవంతం చేద్దాం..

1 min read

– మహిళా సర్పంచ్​లకు సూచించిన జేసీ (హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో ఒకటైన జగన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను విజయవంతం చేయాలని జాయింట్​ కలెక్టర్ (హౌసింగ్​)నారపు రెడ్డి మౌర్య మహిళా సర్పంచ్​లకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని జీవ సుధ ట్రైనింగ్​ సెంంటర్​లో కోడుమూరు , నందికొట్కూరు నియోజకవర్గాల్లోని మహిళా సర్పంచ్​లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మూడు రోజుల ప్రాథమిక శిక్షణలో భాగంగా మొదటి రోజు జాయింట్​ కలెక్టర్ ( హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్య ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సర్పంచ్​లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిపిఓ, డిల్ డి ఓ కర్నూల్, డి ల్ పి ఓ కర్నూల్, ఈ ఓ పి ర్ డి కర్నూల్, తదితరులు పాల్గొన్నారు.


About Author