PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలును..హరితవనంగా మార్చుదాం..

1 min read

– వైఎస్సార్​ జయంతిన 50 వేల మొక్కలు నాటుదాం..
– నగర మేయర్​ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రంలోనే కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుదామని మేయర్​ బీవై రామయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఔట్​ డోర్​ స్టేడియంలో నగర కమిషనర్​ డీకే బాలాజి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బాంధవుడు, దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిన 50వేల మొక్కలు నాటుదామని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి మాట్లాడుతూ… ఖాళీ ప్రదేశాల్లో ఇప్పటికే మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో గుంతలను తీయడం శుభపరిణామన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. జులై 8న జరిగే ఈ మహోన్నత యజ్ఞంలో ప్రతి నగర పౌరుడు పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్​ సిద్ధారెడ్డి రేణుక, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్​ తదితరులు పాల్గొన్నారు.

About Author